రాయలసీమ హక్కుల సాధన కోసం ఈనెల 24న నిరసన దీక్షను చేపడుతున్నట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకుడు సీమకృష్ణ తెలిపారు. కర్నూలు నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్ధేశ్వరం- సంగ మేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని, అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మించడం వలన రాయల సీమకు తుంగభద్ర నది నుం చి రావాల్సిన నికర జలాలు హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు రైతులకు నీళ్లు రావన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరుతూ ఈనెల 24న కర్నూలు నగరంలో స్టీరింగ్ కమిటీ చైర్మెన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష ను చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హరినాయుడు, నాగభూషణం, గోపాల్, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa