గంజాయి మత్తులో యువత, రాష్ట్రంలో పలుచోట్ల భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఇటీవల అవనిగడ్డ ,నాగాయలంక మండలంలో ఓ యువకుడు గంజాయి సేవించి ప్రధాన రహదారిపై హల్చల్ చేస్తూ పలువురిని ఆటకాయించి దౌర్జన్యం చేశాడు. పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, నాగాయలంక, కొత్తపాలెం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువత సాయంత్రం అయితే కరకట్ట వద్దకు చేరుకుని గంజాయి సేవిస్తూ అటుగా వెళ్లే వారిని అటకాయిస్తున్నారు. గంజాయిని స్మగుల్డ్ సిగరెట్లో పెట్టి ఒక్కో సిగరెట్ను రూ.40కి విక్రయిస్తున్నారని, ఇలా అయితే పబ్లిక్గా తిరిగినా ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో గంజాయి సరఫరా దారులు ఈ తరహా సిగరేట్లను పెద్దఎత్తున అమ్ముతున్నారు. ఇటీవల చల్లపల్లిలో గంజాయి అమ్మకాలు జరుగుతుండగా, పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. అయితే కేవలం పేదరికంతో గంజాయి అమ్ముతూ జీవనం సాగించే వారిని మాత్రమే పోలీసులు గంజాయి అమ్మకాల్లో అరెస్టులు చూపుతున్నారని, దాని వెనుక పెద్ద తలకాయల గురించి పట్టించుకోవటం లేదని, దీంతో ఎక్కడైనా దాడులు జరిగితే కేవలం ఒకటి, రెండ్రోజులు మాత్రమే గంజాయి దొరకటం ఆగుతుంది తప్ప తర్వాత గంజాయి అమ్మకాలు యథావిధిగానే కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa