దళితులను కేవలం ఓటు బ్యాంకులుగా చుస్తూ వైసీపీ ప్రభుత్వం దళితులను దగా చేస్తోందని జనసేన పార్టీ పశ్చిమ ఇన్చార్జ్ పోతిన మహేష్ ఆరోపించారు. ‘ఇంటింటికీ రాబోయే మన జనసేన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని విజయవాడ కేదారేశ్వరపేట పశ్చిమలోని స్థానిక 34వ డివిజన్, ఖుద్ధూస్ నగర్లో గురువారం మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఖుద్ధూస్ నగర్లో మురుగు సమస్యలు నెలకొన్నాయని, టిడ్కో ఇళ్ల కోసం నాలుగేళ్ల కిందట డబ్బులు చెల్లించినా నేటివరకు ఇల్లు అందలేదని, జగనన్న కాలనీల పేరుతో డబ్బులు కట్టాలని వలంటీర్లు వేధిస్తున్నారని, ప్రస్తుతం బొగ్గు రేటు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పెరగడంతో రజకుల ఆదాయం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది జనసేన ప్రభుత్వమేనని, పవన్కల్యాణ్ తప్పకుండా సీఎం అవుతారన్నారు. దళితులను దగా చేసిన వ్యక్తులుగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, సీఎం జగన్మోహన్రెడ్డి నిలిచారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa