ఏపీ కాంగ్రెస్ కు దెబ్బమీద దెెబ్బపడుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు జాతీయ నేతలు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో చేరిక కార్యక్రమం జరిగింది. కిరణ్కుమార్రెడ్డిని కాషాయం కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని అనుకోలేదన్నారు. 1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్లోనే ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని.. వరుస ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. అందుకే తాను కాంగ్రెస్ను వీడినట్లు చెప్పారు.
కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాలతో ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందని.. కాంగ్రెస్ హైకమాండ్కు పవర్ మాత్రమే కావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎవర్నీ సంపద్రించకుండానే తీసుకుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. హైకమాండ్ తెలుసుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా డైరెక్షన్లో పాలన బాగుంద.. అందుకే బీజేపీలోకి చేరానన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా, అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి (2010 నుంచి 2014 వరకు) 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను కూడా వ్యతిరేకించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతగా పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లగా.. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి ఎదురైంది. మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంతలో ఏమైందో ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరగా.. కిరణ్ కుమార్ రెడ్డికి కమలం పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది చూడాలి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కిషోర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. 2019 ఎన్నికలకు ముందు తెలుగు దేశంలో చేరారు. ఆయన ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పీలేరు నియోజకవర్గ ఇంఛార్జ్గా ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa