వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని రాష్ట్ర స్త్రీ , శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ రాష్ట్ర ప్రజలకి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో వైయస్ఆర్సీపీ పాలనపై ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప వద్ద ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో మమేకమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరిగి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa