-చంద్రబాబు సారథ్యంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
-అభివృద్ధిలో దూసుకుపోతున్న నవ్యాంధ్ర
-ఎమ్మెల్సీల గెలుపుతోనే ఏపి మరింత అభివృద్ధి
-పట్టభద్రుల, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు సహకరిద్దాం
-చీమకుర్తి, వైపాలెం, పొదిలి ఎన్నికల ప్రచారంలో మంత్రి శిద్ధా
ఒంగోలు, మేజర్న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తెదేపా బలబర్చిన ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ఓట్లు వేయాలని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖామంత్రి శిద్ధా రాఘవ రావు పట్టభ ద్రులు, ఉపాధ్యాయులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చీమకుర్తి, పొదిలి యరగ్రొండపాలెం ప్రాంతాల్లో ఓటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవ
రావు మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు హయాం లోనే నూతన రాష్ట్ర అభివృద్ధి చెందు తోందన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాషా్టల్రో మూడోదిగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్ని శలు కష్టిస్తున్నారన్నారు. ఆయన ఇంకా రాషా్టన్న్రి అభి వృద్ధి పథంలో నడిపించాలంటే శాసన మండలి సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు వాసుదేవ నాయుడు, పట్టాభి రామిరెడ్డికు ఓట్లు వేసి గెలిపించి శాసన మండలీకి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వమే ఉపాధ్యాయుల సంక్షేమా నికి పెద్దపీట వేసిందన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుదని, త్వరలోనే మంచి సుభవార్త వింటారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శిద్ధా రాఘవరావుతోపాటు స్ధానిక శాసన సభ్యులు డేవిడ్ రాజు, మాజీ శాసన సభ్యులు బీఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కళాశాలల యాజమాన్యలు, అధ్యాపకులు, ఉపాధ్యా యులు, పట్టభద్రులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa