జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ శివారులో పోచంపల్లికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యమైనట్లు చిల్లకల్లు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జయంతిపురం నుండి పోచంపల్లికి వెళ్లే దారిలో కొత్తగా వేసిన మెటల్ గ్రావెల్ రోడ్డు పక్కన భూక్యా రాము పొలము పక్కన ఉన్న బోధలో నుండి దుర్వాసన వస్తున్నట్లు జయంతిపురం వీఆర్వో ధారా గోవిందరాజు పోలీసులకు సమాచారం అందించారు.
జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, చిలకలు ఎస్ఐ మరియు సిబ్బంది ఆ దుర్వాసన వెదజల్లే ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ ఎరువుల సంచి ఎవరో గుర్తుతెలియని మగ శవము ఉన్నట్లు గుర్తించారు. కాళ్లు చేతులు కలిపి పురికొసతో కట్టబడి సంచిలో సుమారుగా 30 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉన్న యువకుని మృతదేహం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అతన్ని ఎవరో ఎక్కడో హత్య చేసి ఎరువుల సంచిలో మూట కట్టి ఇక్కడకు తీసుకోచ్చి పాతిపెట్టినట్లు విఆర్ఓ పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాది వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిసిన జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లేదా చిల్లకల్లు ఎస్సై ఫోన్నెంబర్లకు8332983809, 9440796465 సమాచారం అందించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa