గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం రాంబిల్లి మండలం లాలంకొడురు సచివాలయం పెద్దయాత పాలెం, యరకన్నపాలెం, చేటమెట్ట, సీతపాలెం గ్రామంలో యలమంచిలి శాసనసభ్యులు యు. వి రమణమూర్తి రాజు (కన్నబాబు) డిసిసిబి మాజీ ఛైర్మన్ యు. సుకుమార్ వర్మ (తేజ) లు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న మూడేళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు వచ్చిన లబ్ధి గూర్చి వివరిస్తూ ఇంకా మీకు అర్హత వుండి ఏమైన పథకాలు రాలేదా అని అడిగి తెలుసుకుని ప్రభుత్వ అధికారులను తక్షణమే వారి సమస్యలను పరిష్కరించవలసినదిగా అదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎలమంచిలి, మునగపాక, అచ్చుతాపురం, రాంబిల్లి మండలాల ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa