ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయం నందు రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి వైయస్సార్సీపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలవేసి మరియు పూలు సమర్పించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందామని, వారి ఆశయాలను కొనసాగిద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షులు కృష్ణారావు యాదవ్, రాజంపేట పట్టణ జేఏసీ కన్వీనర్ ఇంచార్జ్ వడ్డే రమణ, రాజంపేట గ్రామీణ జేఏసీ కన్వీనర్ల ఇంచార్జ్ మందరం గంగిరెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, పాలగిరి మల్లికార్జున్ రెడ్డి, వైయస్సార్సీపి రాజంపేట మహిళ కార్యదర్శి మిరియాల సురేఖ, వైసిపి యూత్ లీడర్ రాంనగర్ శివ, శివయ్య, సర్పంచ్ రాజా, వీరయ్య, మురళి ఆచారి, ఎన్. సుబ్బారెడ్డి, బిసి నాయకులు మనుబోలు వెంకటసుబ్బయ్య, రాజేష్, దాసరి పెంచలయ్య, కనకరాజు, సార రాజేష్, చందా. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa