ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులరా సిద్ధమవ్వండి, పిలుపునిచ్చిన బొప్పరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 01:10 PM

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా మంగళవారం సెల్‌ఫోన్‌ డౌన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులంతా ఒక్కరోజు సెల్‌ఫోన్‌ వినియోగించకుండా తమ ఆవేదన, నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం అన్ని కలెక్టరేట్ల వద్ద వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa