లండన్లో చదువుకొంటున్న కుమార్తెతో వేసవి సెలవులు గడిపేందుకు సీఎం జగన్ దంపతులు ఈ నెల 21న బయలుదేరే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. అయితే, పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారుకాలేదని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. లండన్లోని కుమార్తె వద్దకు జగన్ దంపతులు ఏటా వెళ్తున్నారు. గత ఏడాది ఆమె డిగ్రీ పట్టా పొందిన సందర్భంలో జగన్ దంపతులు ప్రత్యేకంగా హాజరయ్యారు. 2021లో కుమార్తెల సమక్షంలో జగన్ దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. 2022 మే20న వీరు లండన్ వెళ్లినప్పుడు వివాదం తలెత్తింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు జగన్ ప్రత్యేక విమానంలో దావో్సకు వెళ్లారు. విమానంలో నేరుగా దావోస్ వెళ్లకుండా..లండన్ మీదుగా వెళ్లడం అప్పట్లో దుమారం రేపింది. మరి ఈ సారి ఏమౌతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa