దేశంలోని బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్టంగా ఉందని, అలహాబాద్ బ్యాంక్ విలీనం తర్వాత దేశంలోనే 7వ అతిపెద్ద బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరించిందని రాజమహేంద్రవరం చీఫ్ జనరల్ మేనేజరు(సీజీఎం) కేఎస్.సుధాకరరావు అన్నారు. ఐఎల్టీడీ జంక్షన్ ఫ్లయ్ ఓవర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ బాలాజీపేట బ్రాంచిని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. స్వయం సహాయక బృందాలకు రూ.20 లక్షల చొప్పున రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఏపీలో 15 వేల ఎస్హెచ్జీలకు రూ.700 కోట్లు రుణంగా ఇచ్చామన్నారు. బియ్యం కస్టమ్స్ మిల్లింగ్ నిమిత్తం ఇచ్చే బ్యాంకు గ్యారంటీలను అత్యంత తక్కువ కమిషన్తో ఇస్తున్నామని చెప్పారు. రాజమహేంద్రవరం జోన్లో బాలాజీపేట 64వ బ్రాంచి అని తెలిపారు. మరో 6 బ్రాంచిల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇండియన్ బ్యాంకు వినియోగదారులు ఐఎన్డీవోఏఎస్ఐఎస్ (ఇండ్ఒయాసిస్) యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని బ్రాంచి మేనేజరు వీ.శివాజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు భవన యజమానులు శ్రీనివాస్, రత్నకుమారి దంపతులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa