శ్రీకాళహస్తి రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రియ విద్యాలయంను మంగళవారం రోజున తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు. ముఖ్యంగా పర్మినెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గూర్చి ఆలాగే వాష్ రూమ్స్ అపరిశుభ్రంగా. ఉంటున్నాయని విద్యార్థులు ఎంపీ గురుమూర్తికి ఏకరువు పెట్టారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు. సమస్యలన్నీ కేంద్రియ విద్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకొంటామని విద్యార్థులకి చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని వారిని ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa