తాము అధికారంలోకి వస్తే.. రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షలు అందచేస్తామని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. కోలార్లో నిర్వహించిన ‘పంచరత్న’ ర్యాలీలో కుమారస్వామి ఈ హామీ ఇచ్చారు. ‘‘రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు సుముఖంగా లేరని నా దృష్టికి వచ్చింది. అందుకే రైతుల పిల్లల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు.. వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు మా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల నగదు అందిస్తుంది’’ అని చెప్పారు. మన పిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 224 స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కనీసం 123 స్థానాలను సాధించాలని జేడీ(ఎస్) టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 93 మంది అభ్యర్థులను ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa