ఈ ఏడాది వర్షాలు తక్కువేనని ఐఎండి నివేధిక వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో వర్షపాతంపై ప్రయివేట్ వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ అంచనాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 94 శాతం (5% అటు, ఇటుగా) ఉంటుందని స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించింది. రుతుపవన వర్షపాతానికి సంబంధించి ఎల్పీఏ 96 నుంచి 104% మధ్య ఉంటే దాన్ని సాధారణంగా లెక్కిస్తారు.
‘‘ట్రిపుల్-డిప్-లానినా కారణంగా గత నాలుగు సీజన్లలో నైరుతి రుతుపవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది.. లానినా పీరియడ్ ముగిసి ఎల్నినో సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయి.. రుతుపవనాలు సమయానికి ఇవి మరింత బలపడొచ్చు’’ అని జతిన్ పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం లానినా.. ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. రెండు, మూడేళ్లుగా లానినా దశ కొనసాగుతుంది. ఈ సమయంలో దక్షిణాసియాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.
రెండు, మూడేళ్లుగా భారత్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. ఎల్నినోతో ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. భారత్లో ఉత్తరాదిలో ఒకలా.. దక్షిణాదిలో మరోలా ఉండొచ్చు. అసలు వర్షం కురవపోవడం, తక్కువగా ఉండటం జరుగుతుంది. ఎల్నినో సమయంలో తుపాన్లు సంభవిస్తే వర్షపాతం మారుతుంది. అంటే ఎక్కడికక్కడ పరిస్థితులను బట్టి దాని ప్రభావం ఉంటుంది.
ఎల్నినోతోపాటు ఈసారి రుతుపవనాలను ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయని స్కైమెట్ తెలిపింది. ‘ఇండియన్ ఓషియన్ డైపోల్ (ఐఎండి)’ కూడా ఈసారి ‘అవుట్ ఆఫ్ ఫేజ్’లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. తత్ఫలితంగా నెలవారీ వర్షపాత పంపిణీలో తీవ్ర వ్యత్యాసానికి దారితీయొచ్చని తెలిపింది. అలాగే సీజన్ ద్వితీయార్ధం మరింత అస్పష్టంగా ఉంటుందని పేర్కొంది. తగినంత బలంగా ఉన్నప్పుడు ఐఓడీకి రుతుపవనాలను నడిపించే సామర్థ్యం ఉంటుంది. తద్వారా ఎల్నినో దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.
ఐఎండిని ‘ఇండియన్ నినో’ అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల క్రమరహిత హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ప్రస్తుతం ఐఓడీ స్థిరంగా ఉందని స్కైమెట్ తెలిపింది. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర, మధ్య భారత్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు స్కైమెట్ తెలిపింది. జులై, ఆగస్టులో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అతి తక్కువ.. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్లో ఎల్పీఏ 99 శాతం, జులైలో 95 శాతం, ఆగస్టులో 92 శాతం, సెప్టెంబరులో 90 శాతం ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. ఇదిలావుంటే ఈ ఏడాది రుతుపవన వర్షపాతం అంచనాలను ఐఎండీ ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా మే చివరి, జూన్ తొలివారంలో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ముందుగా కేరళ తీరాన్ని తాకి క్రమంగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి విస్తరిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa