బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగారెడ్డిగూడెం బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పని చేస్తున్న మొరపాక రామశేషాచార్యులు నకిలీ గోల్డ్పై రూ.68 లక్షలు కాజేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సాగర్బాబు తెలిపిన వివరాల ప్రకారం రామశేషాచార్యులు కొంతకాలంగా బ్యాంక్లో బంగారు స్వచ్ఛత, ధ్రువీకరణ అప్రైజర్గా పని చేస్తున్నట్టు తెలిపారు. అయితే వ్యక్తిగత అవసరాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు తెలిసిన వారి నుంచి నకిలీ బంగారు ఆభరణాలు తీసుకొని వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగిన ఆడిట్లో ౖమోసం బయటపడినట్టు తెలిపారు. మొత్తం 1823 బంగారు నగల ప్యాకెట్లకు గాను 113 ఆభరణాల ప్యాకెట్లు నకిలీ ఆభరణలుగా గుర్తించారని తెలిపారు. వాటి విలువ రూ.68,80,336 గా తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి కొటికలపూడి కరుణ కుమార్ ఫిర్యాదు మేరకు మొరపాక రామశేషా చార్యులుతో పాటు అతనికి సహకరించిన మరో 29 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa