ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలపై సెటైర్లు వేసిన జనసేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 01:46 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకులపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రుషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా అంటూ ట్విట్టర్‌లో సెటైర్ వేశారు. చెట్లు, కొండలను నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణమని విమర్శించారు. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ పవన్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa