మార్గదర్శి వ్యవహారంలో బ్రహ్మయ్య అండ్ కో ఆడిట్ సంస్థ ఆడిటర్ కె.శ్రవణ్కు రిమాండ్ విధించే అధికారం విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నిచింది. మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుబట్టింది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లి్షమెంట్ యాక్ట్ ప్రకారం నమోదైన కేసును నిబంధనల ప్రకారం సెషన్స్ జడ్జి విచారించాలని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఇన్క్యూరబుల్ డిఫెక్ట్ చోటుచేసుకుందని వ్యాఖ్యానించింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని, దీనిని సీరియ్సగా తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దీనిని ఏవిధంగా సమర్థించుకుంటారని సీఐడీని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని సీఐడీ తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివా్సతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. పిటిషనర్ అయిన శ్రవణ్ భార్య నర్మద తరఫున సీనియర్ న్యాయవాది కె.ఎస్.మూర్తి, సీఐడీ తరఫు న్యాయవాది శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa