యూపీలో తుపాకుల పాలన కొనసాగుతోందని యోగి సర్కారుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఇలాంటి తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే హంతకులు కాల్పులు జరపడంపై అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరిగాక దేశంలో రాజ్యాంగం, శాంతిభద్రతలపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ దారుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీలో యూపీకి చెందిన అధికారులకు చోటివ్వకూడదని అన్నారు. తనకు భయంలేదని, తప్పకుండా ఉత్తరప్రదేశ్ కు వస్తానని, చనిపోవడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa