కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి 75వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వలగొండ గ్రామస్తులు లోకేష్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తుమ్మల వంక బ్రిడ్జి నిర్మించాలని, వలగొండ నుంచి పప్పుల దొడ్డి వరకు రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరగా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa