విజయనగరంలోని కాటవీధికి చెందిన రౌడీ షీటర్ షేక్ అలీ జాన్ (33) మృతిపై కలకలం రేగుతోంది. ఆయన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, చిన్నాపురం సమీపంలోని ప్రైవేట్ లే-అవుట్లో పెట్రోల్ పోసి తగులబెట్టేశారని పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 15న దాసన్నపేట రింగురోడ్డు సమీపంలోని ఓబార్ రెస్టారెంట్కు అలీజాన్, లక్ష్మణరావు ఇంకొందరు మద్యం తాగేందుకు వెళ్లి అరువు ఇవ్వాలన్నారు. ఇప్పటికే బాకీ ఉన్నందున కుదరదని నిర్వాహకులు చెప్పడంతో గొడవపడ్డారు. ఇందులో అలీజాన్, లక్ష్మణరావుతో పాటు వెయిటర్ సూరిబాబు గాయపడ్డారు. లక్ష్మణరావును ప్రైవేటు ఆసుపత్రికి, సూరిబాబును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. లక్ష్మణరావును గాయపర్చినందుకు డబ్బులి వ్వాలని అలీజాన్ మళ్లీ బార్ నిర్వాహకులతో గొడవపడ్డారు.
అలీజాన్ ఇంటికి రాకపోవడంతో భార్య నాజియా రెండో పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మణరావును చూసేందుకు అలీజాన్ ఆసుపత్రికి వెళ్లినట్లు ఆ తర్వాత ఆయన కన్పించలేదని పోలీసులు గుర్తించారు. అలీజాన్ కన్పించకపోవడంతో చక్రధర్తో పాటు మరో ఆరుగురు బార్ సూపర్వైజర్ శివప్రసాద్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న శివప్రసాద్ బావమరిది సన్యాసిరావు కారును వెంబడించారు. కిడ్నాపర్లు శివప్రసాద్ను ఎల్లమ్మతల్లి గుడి వద్ద వదిలేయగా ఈ నెల 17న ఆయన ఒకటో పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa