ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 01:13 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం 9. 20గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యులు బి. సత్యవతి, జి. మాధవి, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున , పోలీస్ కమిషనర్ డా. సి. యం త్రివిక్రమ్ వర్మ , జిల్లా జాయింట్ కలెక్టర్ కె. యస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమీషనర్ సి. యం సాయికాంత్ వర్మ , ఎపిఈపిడిసియల్ సియండి ఐ. పృధ్వి తేజ్ విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పుష్ప గుచ్చాలు అందజేసి ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో గం. 9. 30ని. లకు శ్రీకాకుళం లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa