కడపలో విషాద ఘటన జరిగింది. భార్యాభర్తలు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. నగరంలోని విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమమాలినీలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. సాయికుమార్ వ్యాపారాలు చేస్తుంటారు.. అయితే కొంతకాలంగా భార్యాభర్తలిద్దరూ ఆర్థిక సమస్యలతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో.. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
భార్యాభర్తలిద్దరూ మంగళవారం రాత్రి కడప శివారులో ఉన్న కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. స్థానికులు కొద్దిసేపటికి గమనించి కడప రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాయికుమార్ రెడ్డి భార్య హేమమాలిని 8 నెలల గర్భవతి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల ఆత్మహత్యకు ఆర్థికపరమైన సమస్యలే కారణమా.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వివాహమైన ఏడాదికే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa