అతిక్ అహ్మద్ సోదరుల ధారుణ హత్య ఇపుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అతిక్ అహ్మద్.. ఒకప్పుడు డాన్. చాలా మంది కీలక నేతలతో సంబంధాలు ఉన్న ప్రజాప్రతినిధి. ఎన్నికల సమయంలో చాలా మందికి అవసరం. అలాంటి వ్యక్తిని పోలీసులు, మీడియా చూస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకులు పెట్టి కాల్చి చంపారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి లొంగిపోయారు. ఆ తర్వాత ఆ ముగ్గురు నిందితులు చెప్పిన మాటలు అనేక అనుమానాలకు దారితీశాయి.
అండర్ వరల్డ్లో ఫేమస్ కావాలన్న కోరికతో.. అతిక్ అహ్మద్ను చంపేశామని.. నిందితులు లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య ప్రాథమికంగా అంగీకరించారు. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. నిజంగా అండర్ వరల్డ్లో ఫేమస్ కావాలనే కోరిక వారికి ఉంటే.. ఇప్పుడు చేసినట్టు వేరే ఎవర్నైనా హత్య చేయొచ్చు. ఇంకా ఏమైనా చేయొచ్చు. కానీ.. అతిక్నే ఎందుకు టార్గెట్ చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కిల్లర్స్ వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారనే ప్రచారం జోరందుకుంది.
పైగా.. నిందితులు వాడిన గన్స్పై భారత్లో నిషేధం ఉంది. అవి కావాలంటే ఇల్లీగల్ స్మగ్లింగ్ ఒక్కటే మార్గం. అయినా ఒక్కోదానికి తక్కువలో తక్కువ రూ.10 లక్షలు కావాలి. అలాంటి గన్స్ వారికి ఎలా వచ్చాయి.. ఎవరు ఇచ్చారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు తనను చంపేస్తారని అతిక్కు ముందే తెలుసని అతని సన్నిహితులు చెబుతున్నారు. పలుమార్లు అతిక్ ఈ విషయాన్ని చెప్పారని.. అందుకే గుజరాత్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు.
అంతే కాదు.. అతిక్ పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అతిక్ కుమారుడు అసద్ను ఎన్కౌంటర్లో లేపేశాక.. అతను మనోవేదన చెందినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే.. తాను అన్ని విషయాలు పోలీసులకు చెప్పడానికి రెడీ అయ్యానని సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవేళ అతిక్ నోరు విప్పితే.. చాలా మంది కీలక నేతల పేర్లు బయటకు వస్తాయని.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో.. అతిక్ను హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. అవసరం ఉన్నప్పుడు అతిక్ డబ్బులు అరేంజ్ చేసేవాడని.. చాలామంది కీలక నేతలు ఇతని ద్వారా.. పాకిస్తాన్లో ఆస్తులు కొన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఆ ఆస్తులను అమ్మి.. ఆ డబ్బును హవాలా ద్వారా దుబాయ్ తరలించి.. అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చేవారని.. ఈ మొత్తం వ్యవహారంలో.. అతిక్ చాలా కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో వేరే నేతల కోసం అతిక్ నేరాలు చేసినట్టు సమాచారం.
వీటన్నింటి నేపథ్యంలో.. అతను నోరు విప్పితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన కొందరు నేతలు.. అతిక్ మర్డర్కు ప్లాన్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేతలు కూడా ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని.. వారే అతిక్ మర్డర్కు స్కెచ్ గీసి.. ఆయుధాలు సమకూర్చి.. ముగ్గురు కిల్లర్స్ను రంగంలోకి దింపారనే టాక్ ఉంది. అంతే కాదు.. మర్డర్కు కిల్లర్స్కు ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వం దీనిపై సీరియస్గా ఉంది. విచారణను వేగవంతం చేసింది.ఈ నేపథ్యంలో.. అతిక్ హత్య కేసులో కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa