ఓ మహిళ ఏకంగా నలుగురు శిశువులకు ఒకేసారి జన్మనిచ్చింది. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లా బజారిచర ప్రాంతంలోని ఓ క్రిష్టియన్ మిషనరీ ఆసుపత్రిలో జరిగింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన జనతా ఖచియా అనే మహిళను వైద్యులు పరీక్షించారు. ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరమని భావించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa