ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్య తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని ఉక్కు కళా వేదిక నందు బుధవారం రాత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్, ప్రభుత్వ ఆస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు పటాన్ అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును రాష్ట్రప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఉదయభాను మాట్లాడుతూ ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు, రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు, సోదరీమణులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతోఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు, అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర జిల్లా భావంతో ఉండాలన్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలకు నూతన వలను అందించడం జరిగింది. ఈ కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎన్టీఆర్ వక్స్ బోర్డ్ సెక్రెటరీ జుబేర్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ మోహిద్దీన్, కోఆప్షన్ బాబు, దర్గా కమిటీ చైర్మన్ ఖాజా, ఈద్గా కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అలీమ్, జామియా మసీదు ప్రెసిడెంట్ జలీల్, రి టైర్డ్ ఎన్ఎస్పి సైదా, హలీమ్, హాఫిజ్, తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa