మోదీ పాలనలో సామాన్యులపై మోయలేని ధరల భారం మోపుతున్నారని సీపీఎం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుడు గండవరపు శేషయ్య అన్నారు. పోతిరెడ్డిపాళెంలోని శ్రీవాణికాలనీ, వారధి సెంటర్, పల్లిపాలెం, తిప్ప, అంబేడ్కర్ సెంటర్, చంద్రశేఖరపురం కాలనీల్లో సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు బుధవారం చేపట్టిన ప్రచారభేరి పాదయాత్రల్లో ఆయన మాట్లాడారు. గ్యాస్ ధర, నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఈ యాత్రలో సీపీఐ, సీపీఎం నాయకులు రమణయ్య, ఖాదర్బాష, మున్వర్బాబు, రమేష్, బీబీజాన్, శివ, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa