ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీదే విజయం : కేఈ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 02:53 PM

కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులదే విజయమని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు అన్నారు. కర్నూలులో వైసీపీ ఉనికి కోసమే ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు. జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఐకమత్యంతో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఓడిపోతామని తెలిసీ కూడా వైసీపీ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తోందో ఆ నాయకులకే వాళ్లకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని కేఈ ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 80 శాతం ఓట్లు టీడీపీకి ఎందుకు పడకూడదనేదే సీఎం చంద్రబాబు ఉద్దేశమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.ముఖ్యమంత్రి ఉద్దేశాన్ని కర్నూలు జిల్లా నుంచే నిరూపించుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa