ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు 11.06 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 04:14 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ నరసింహన్ నూతన అసెంబ్లీ భవనాన్ని11.06 గంటలకు ప్రారంభిస్తారు. ఈ అసెంబ్లీ ప్రాంగణం మొత్తం 5 గేట్లు, 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి.. వీటిని ప్రోటోకాల్ ప్రకారం కేటాయించారు. అసెంబ్లీని సందర్శించే పాత్రికేయులు, ఎన్జీవోలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మొదటి గేటు నుంచి ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, రెండోగేటు నుంచి మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మూడోగేటు నుంచి మీడియా ప్రతినిధులు, సందర్శకులు, ఇతర అధికారులు, నాలుగో గేటు నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐదో గేటు నుంచి సీనియర్ అధికారులు, అసెంబ్లీ సిబ్బంది వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa