వైసీపీ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ పాలన పది తలల రాక్షసుడుని తలపిస్తుంది. రాష్ట్రంలో జగనాసురుడి పాలన సాగుతోంది. 43 వేల కోట్ల అవినీతిపై సీబీఐకి ఆధారాలు కూడా లభించాయి. రాష్ట్రంలో భూ మాఫియా, ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి. రైతులను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం ఇది. వివేకానంద రెడ్డి మృతి తెల్లవారుజామున 4 గంటలకు జగన్కు తెలిసింది. కానీ సాయంత్రం వరకూ కడపకు రాలేదు. హత్య కేసును చంద్రబాబుపై, టీడీపీపై నెట్టివేయాలని చూశారు. బాబాయ్ హత్యను రాజకీయంగా ఉపయోగించుకుని లబ్ధి పొందారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేకుండా పోయింది. దశల వారీగా మధ్య నిషేధం ఏమైంది?, చివరకు ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా మహిళలకు రక్షణ లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పది తలల జగన్ పాలన అంతం. వచ్చే ఎన్నిక్లలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చి వేస్తారు. జగన్ స్టిక్కర్లు భయపెట్టి ఇళ్లకు అంటిస్తున్నారు. చాలా మంది వాటిని వెంటనే తొలగిస్తున్నారు.’’ అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa