దేవతలారా తరలిరండి శ్రీవారి ఉత్సవాలను విజయవంతం చేయండి అంటూ వేద పండితులు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు ధ్వజారోహణం కార్యక్రమాన్ని అర్చకులు, అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత గరుత్మంతుడికి ప్రత్యేక పూజలు చేసి, ధ్వజస్తంభానికి దర్బాలు కట్టి విశేష పూజలు నిర్వహించారు.అనంతరం గరుత్మంతుడీ చిత్రాన్ని వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ధ్వజస్తంభంపై ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు విజయవంతం కావాలంటూ సకల దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఇఓ జనార్ధన్ రెడ్డి, ఆలయ అర్చకులు, టీటీడీ వేద పండితులు, సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa