పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టీడీపీ సిద్ధాంతమని, అందులో భాగంగా అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు, సర్పంచ్ ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు, సర్పంచ్ ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ శనివారం 19వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్ లో ఐదో రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలుచోట్ల పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు.
అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్రబాబునాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరధరలతో పేదల, సామాన్యుల బతుకులు చిన్నాభిన్నమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 480 మంది అన్నార్తులు భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అంబటి లక్ష్మిరాజ్యం, టీ ఎన్ ఎస్ ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు రెడ్డి శంకర్, మండల ప్రదాన కార్యదర్శి కంచు దశరథ రావు, బైరివాని పేట సర్పంచ్ బైరి నరేష్, రాయ్ కిరణ్, చీపురు రమణ, మైలిపల్లి నరసింహ మూర్తి, రఫీ, పేట పద్మ, మోహన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa