ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 02:51 PM

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం భట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మంగళవారం జరిగింది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు మండల గ్రామం భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండల ఎమ్మార్వో కార్యాలయమునకు ర్యాలీగా విచ్చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాకా శేషు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూనుగుంట్ల సాయి బాబా, మాజీ అధ్యక్షులు కర్ణ శ్రీనివాసరావు, కుక్కల వెంకటేశ్వరరావు, వేములపల్లి జగన్నాధం, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, అనగాని ఏడుకొండలు, డోలా శివకుమార్, యడ్ల జయశీలరావు, బొర్రా సాంబయ్య, వామనపల్లి కోటేశ్వరరావు, దీపాల ప్రసాద్, పరుచూరి రఘు, వాకా వెంకట నారాయణ, భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa