ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని మంగళవారం పొన్నూరు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ పొన్నూరు పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. మిరప, మొక్కజొన్న, పసుపు, జొన్న, శనగ, వేరుశనగ మామిడి, అరటి ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని వర్షాలతో బాగా మగాణి చేలో నీరు నిల్వ ఉండటం వలన పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారని వినతిపత్రంలో తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, పొన్నూరు నియెజికవర్గం ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వర రావు, పొన్నూరు మండల పార్టీ అధ్యక్షలు బండ్లమూడి బాబురావు. పొన్నూరు పట్టణ పార్టీ అధ్యక్షలు పఠాన్ అహ్మద్ ఖాన్ , తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ, పొన్నూరు నియెజికవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షలు పఠాన్ అహ్మద్ ఖాన్, పొన్నూరు నియెజికవర్గ యస్. సి సెల్ అధ్యక్షలు ఎద్దు సోంబాబు, పొన్నూరు మండల తెలుగు యువత అధ్యక్షలు మొవ్వ వెంకట క్రిష్ణ, షేక్ బాజీ సాహెబ్, షేక్ బాజీ, లాడన్, చెలమశెట్టి సీతారామయ్య, మోపర్తి స్టాలిన్, షేక్ కరిముల్ల బాజీ, తదితరలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa