ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌లో ఆకస్మిక హిమపాతం,,ఇబ్బందులు పడుతున్న స్థానికులు

national |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 09:24 PM

కాశ్మీర్‌లో ఆకస్మిక హిమపాతంతో పర్యాటకులు సంతోషిస్తున్నారు. అయితే.. కాశ్మీర్ పర్యటన వచ్చే టూరిస్టులు వెచ్చని దుస్తులను తెచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సలహా ఇచ్చింది. అకాల హిమపాతం కారణంగా.. చలి తీవ్రంగా పెరిగింది. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెలలో గుల్‌మార్గ్‌లో ఇంత భారీ హిమపాతం నమోదు కావడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.


కాశ్మీర్‌లో ఇది వేసవి కాలం ప్రారంభ నెల. కానీ.. వేసవి వేడికి విరుద్ధంగా.. భారీగా మంచు కురుస్తోంది. దీన్ని టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక పర్యాటకుడు మాట్లాడుతూ.. 'ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. నేను పునర్జన్మ పొంది మరొక జీవితాన్ని గడుపుతున్నాను' అనే ఫీలింగ్ కలుగుతోందని చెప్పాడు. కాశ్మీర్ లోయలో సాధారణంగా డిసెంబర్, మార్చి నెలలలో మంచు కురుస్తుంది. మే నెలలో మంచు కురవడం అసాధారణంగా భావిస్తున్నారు. కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోని కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.


వాతావరణంలో మార్పు కారణంగా కాశ్మీర్ లోయకు వెళ్లేందుకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫరూక్ కటు.. విమానయాన టిక్కెట్ల ఆకస్మిక పెంపును నియంత్రించడానికి జోక్యం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ,  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారని, గో-ఎయిర్‌ దివాలా తీయడంతో ధరలు భారీగా పెరిగాయని, కాశ్మీర్‌లోని పర్యాటక రంగాన్ని కాపాడేందుకు ధరలు తగ్గించాలని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa