ఈ నెల 12న జరిగే మహాత్మ జ్యోతిరావు, సావిత్రిభాయి పూలేల విగ్రహ అవిష్కరణను విజయవంతం చేయాలని బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. మారేష్, మహిళ సంఘం అధ్యక్షురాలు వేముల బేబిరాణిలు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక సత్యనారాయణపురంలోని అంజనేయ పంక్షన్ హాల్లో బిసి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుకోల్లు వెంకటమల్లేశ్వరావు, నియోజకవర్గ అధ్యక్షులు దారం నరసింహారావుల అధ్వర్యంలో కాంస్య విగ్రహాల అవిష్కరణ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గుడివాడలోని ముగ్గు బజార్ వద్ద ఏర్పాటు చేసిన మహ్మాత జ్యోతిరావు, సావిత్రిభాయి విగ్రహాలను ఈ నెల 12న రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావులు ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా సాయంత్రం భారీ ర్యాలీ, అనతరం స్థానిక కొత్త మున్సిపల్ కార్యాలయం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి బిసి సోదరులు, సోదరిమణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యామిని దేవి, దొండపాటి కృష్ణ. తమ్మా రమేష్, యార్లగడ్డ గోవర్ధనరావు, సంభాని రంగారావు, సిహెచ్. సత్యనారాయణ, లోయ రాధకృష్ణ, బోయిన సోమశేఖర్, మూడెడ్ల ఉమా, ఎం. రాణి, ఉక్కంటి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa