ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక పోలింగ్‌లో పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన వధువు

national |  Suryaa Desk  | Published : Wed, May 10, 2023, 10:44 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటన్నారు. దీంతో పోలింగ్ బూత్‌ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా క్యూలైన్లలో ఓటర్లను నిల్చొని ఉండగా.. పోలింగ్ కేంద్రాలకు చాలామంది తరలివస్తున్నారు. సాయంత్రం నాటికి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది.


అయితే పోలింగ్ వేళ ఆసక్తికర పరిణామాలు చేటుచేసుకుంటున్నారు. చిక్కమంగళూరులోని పోలింగ్ బూత్ 165 వద్దకు ఓ వధువు పెళ్లి దుస్తులు, మెడలో పూల దండతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. ఇక బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్పీజీ గ్యాగ్ సిలిండర్‌కు పూజలు నిర్వహించారు. కొంతమంది యువతులు గ్యాస్ సిలిండర్‌కు పూలమాల వేసి దాని సమీపంలో అగర బత్తీలు వెలిగించడంతో పాటు కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్‌కు కాంగ్రెస్ నేతలు నమస్కారాలు చేశారు. పోలింగ్ జరుగుతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మోదీ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపునకు వ్యతిరేకిస్తూ వినూత్నంగా ఇలా నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.


కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తమదే గెలుపంటూ ఆయా పార్టీలు ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. దీంతో కన్నడీగుల నాడి ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. పలు సర్వేలు కాంగ్రెస్‌కు జై కొట్టగా.. బీజేపీ కూడా కొన్ని సర్వేలు పట్టం కట్టాయి. దీంతో గెలుపు ఎవరిదనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, జేడీఎస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని పేర్కొన్నారు. 'నేడు యువ ఓటర్లకు గొప్ప అవకాశం వచ్చింది. వారు మార్పు కోసం ఓటు వేస్తారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల, అవినీతి గురించి వారికి బాగా తెలుసు. తమకు 141 సీట్లు ఇస్తారని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అని డీకే శివకుమార్ తెలిపారు.


ఇక ఓటేసిన అనంతరం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు 130 సీట్లు వస్తాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, 150 సీట్లు కూడా వచ్చే అవకాశముందని చెప్పారు. పని చేసే పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను తాను అభ్యర్థిస్తున్నానని, ఈ ఎన్నికలతో దేశ భవిష్యత్తు కూడా ఇమిడి ఉందని అన్నారు.


సీఎం బొసవరాజ్ బొమ్మై తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అవినీతి ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలసని, ఆ పార్టీకి చెందినవారు చాలామంది బెయిల్‌పై బయట ఉన్నారని విమర్శించారు. మాజీ సీఎంపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, లోకాయుక్తలో 60కిపైగా కేసులు ఉన్నాయన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం 100 శాతం ఉందని తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa