ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో.. పాల్గొన్న ఈవో ధర్మారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2023, 07:18 PM

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో శ్రమదానం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని తెలిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఐదు రోజుల పాటు ఐదుగురు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa