ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-రిక్షా బ్యాటరీ పేలి ముగ్గురు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 11:40 AM

ఉత్తర్​ప్రదేశ్‌లోని​ లఖ్​నవూలో ఈ-రిక్షా బ్యాటరీ పేలి ముగ్గురు మరణించారు. అంకిత్ కుమార్​ గోస్వామి అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలు, కోడలితో కలిసి నివసించేవాడు. ఈ రిక్షా నడుపుతూ జీవనం సాగించే అంకిత్, రోజులాగే రిక్షా నడిపి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఈరిక్షా బ్యాటరీకి ఛార్జింగ్​ పెట్టగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అంకిత్​ భార్య, కుమారుడు​, కోడలు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa