ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:12 PM

కర్నాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బీజేపీ 36 నుంచి 37 ఓట్ల శాతం పెంచుకుందన్నారు. తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి పరిస్థితి మరింత మెరుగవుతుందన్నారు. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ సాధించే అవకాశం లేదన్నారు. ప్రధాని పర్యటన వల్ల బీజేపీకి ఈ స్థాయి ఫలితాలు వస్తున్నాయన్నారు. పొలిటికల్ నిపుణులు చెప్పినదానికంటే బీజేపీ పరిస్థితి మెరుగైందని జీవీఎల్ వెల్లడించారు. కర్నాటకలో ఒక సారి అధికారంలో ఉన్న పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం లేదన్నారు. అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా లోక్ సభలో మాత్రం బీజేపీ ప్రభంజనం చూపిస్తుంది. ప్రధాని పర్యటనకు తోడుగా స్థానిక నాయకత్వం మరింత కష్టపడితే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల ప్రభావం పక్క రాష్ట్రాలపై ఉండే అవకాశం లేదని జీవీఎల్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa