ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జడా శ్రావణ్ కుమార్‌ ని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:12 PM

 అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్‌ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం విజయవాడ లో హోటల్ నుంచి బయటకు రాగానే పాదయాత్రకు అనుమతి లేదంటూ జడా శ్రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై జడా శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. తన పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఆర్ 5 జోన్‌పై ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తోందన్నారు. రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ‌క్షణం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. జైలులో పెట్టినా, ఆస్పత్రిలో ఉన్నా తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అరెస్టుపై సీఎం స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యమా, రాచరికమా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నారు. రైతులకు మద్దతు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో నేరమా అంటూ మండిపడ్డారు. తనకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేశారన్నారు. నేటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందని జడా శ్రావణ్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa