రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నా రని, సీఎం కుటుంబ హత్యా రాజకీయాల్లో ఇరుక్కున్నారని త్వరలో భారతీరెడ్డికి సీబీఐ నోటీసులు రావడం ఖాయమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు స్పష్టంచేశారు. విజయవాడ నగరంలోని అజిత్సింగ్నగర్ 59వ డివిజన్లో ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నాం కదా అని చంద్రబాబు జోలికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్థానిక సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముఖ్య మంత్రిని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నవనీతం సాంబశివరావు, జాన్వలి, పర్విన్, బంగారు నాయుడు, వేల్పుల రాజేష్, చల్ల గాలి అనిల్, డేవిడ్ కొండ, దివి ఉమా, వంశీ, గౌస్య, కంచి ధన, మురళీకృష్ణంరాజు, పాల కేశవ, బత్తుల కొండ, పైడి శ్రీను, ఖాశీం, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa