తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఆదివారం రోజు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొత్తగూడెంలో 47 డిగ్రీలు, ఖమ్మంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, ఏపీలోని రాజమండ్రిలో 49, రెంటచింతలలో 48 డిగ్రీలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఎండలు ఇలానే మండిపోతాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.