కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడు పర్వతం మీద అక్రమ పూజలు కలకలం రేపుతున్నాయి. ఈ పూజల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి, మరో నలుగురితో కలసి ఈ పూజలు చేసినట్లు గుర్తించారు. ఈ పర్వతం పైనే మకరజ్యోతిని వెలిగిస్తారు. దీంతో ఈ పర్వతం భక్తులకు పరమ పవిత్రమైనది. అటవీశాఖ సంరక్షణలో ఉన్న ఈ ప్రాంతంలోకి నిందితులు ఎలా ప్రవేశించగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.