ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరసనలకు దిగుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2023, 03:52 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈనెల 22 నుంచి నిరవధిక నిరసనకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)ఏలూరు  జిల్లా కార్యవర్గం పిలుపునిచ్చింది. ఏలూరు సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రభుత్వ వైద్యులసంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహిం చిన ఏపీజీఈఏ కార్యవర్గసమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్‌.విద్యాసాగర్‌ మాట్లాడుతూ, ఉద్యమాన్ని పోరాట స్ఫూర్తితో నిర్వహించాలని పేర్కొన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలు, సకాలంలో జీతాలు, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ సొమ్ములను తిరిగి చెల్లించకపోవడం, రుణాలమంజూరులో జాప్యంపై తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారని వివరించారు. గతనెల 30న రాజమహేంద్రవరంలో రూపొందించిన ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులందరూ సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి జూన్‌ ఏడు వరకు ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొయ్యల గూడెం, పోలవరం, నూజివీడు, బీమడోలు, కైకలూరు, మండవల్లి తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద రిలేనిరాహారదీక్షలు, జూన్‌ 28,29, 30 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిరాహారదీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa