వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పక్కా వ్యూహంతో ముందుకు వెళదామని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని తన స్వగృహంలో రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల క్లస్టర్ ఇనచార్జిలతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, ఇప్పటి నుంచే నాయకులంతా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలోని ఓటరుకు సంబంధించిన సమాచారం మన వద్ద ఉండాలని అన్నారు. గత ఎన్నికల్లో ఓటరు జాబితా విషయంలో ఏమరపాటుగా ఉండటం వైసీపీకి కలిసొచ్చిందని గుర్తు చేశారు. ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి 30 నుంచి 40 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథిని నియమించాలని క్లస్టర్ ఇనచార్జిలకు సూచించారు. ఆయా కుటుంబాల బాధ్యతను పూర్తిగా వారికే అప్పగించి, పర్యవేక్షించాలని సూచించారు. ఓటరు వెరిఫికేషన ప్రధానమైనదని, హౌస్ మ్యాపింగ్ కూడా పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa