టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మంగళవారం కడపలో ఉమ్మడి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాధరెడ్డి, పొలిట్ బ్యూరోసభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, రామగోపాల్రెడ్డి, రాజంపేట పార్లమెంటు నేత గంటా నరహరి, జిల్లా అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, టీడీపీ నేతలు అమీర్బాబు, హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డి, బచ్చల పుల్లయ్య, రమేశ్రెడ్డి, ముక్తియార్ సమావేశమయ్యారు. వీరు లోకేశ్ పాదయాత్ర, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మినీమహానాడుపై చర్చించారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో జరుగుతున్న లోకేశ్ పాదయాత్ర ఈ నెల 23, 24లోపు పూర్తి కావచ్చు. అన్నీ సవ్యంగా జరిగితే 24 లేదా 25న పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మీదుగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నుంచి పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే ఈ నెల 27, 28న రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగురాష్ట్రాల నేతలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో లోకేశ్ జిల్లాలోకి వచ్చిన తరువాత మహానాడుకు వెళతారా, లేక మహానాడు పూర్తయిన తరువాత జిల్లాలో పాదయాత్ర మొదలుపెడతారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. నంద్యాల జిల్లాలో పాదయాత్ర ఆలస్యమైతే ఈ నెల చివర్లో లేదా జూన్ 1, 2 తేదీల్లో జిల్లాకే చేరే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa