నిబంధనలకు విరుద్ధంగా నగర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న గాజువాక నియోజక వర్గ పరిధిలోని అగనంపూడి టోల్గేట్ తొలగించాలని రాజ్యసభ సభ్యులు జి వి ఎల్ నరసింహారావుని గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా బలిరెడ్డి మాట్లాడుతూ, గతంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో గాజువాక బార్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర హైకోర్టులో కేసు వేసి 303/ 2017 ద్వారా అగనంపూడి టోల్ ప్లాజా తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టోల్గేట్ కొంతకాలం రద్దు చేయడం జరిగింది. జాతీయ రహదారి అధికారులు, గుత్తందారులు కలిపి దొడ్డి త్రోవన సుప్రీంకోర్టుకు వెళ్లి అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారులు పనులు నిర్మాణం అయిన తర్వాత సబ్బవరం దగ్గర టోల్ గేటు ప్రారంభిస్తామని వెంటనే అగనంపూడి టోల్ ప్లాజా తొలగిస్తామని సుప్రీంకోర్టు నుండి ఉత్వరులు తెచ్చుకోవడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa