అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావుశతజయంతి ఉత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ రామారావు ని చూస్తే కృష్ణుడు, రాముడు ఇలానే ఉంటారని అనిపించిందిఅన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే పేద ప్రజల కోసం కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు,బుచ్చయ్యపేట మండల పార్టీ అధ్యక్షుడు గోకడ కోటేశ్వరరావు, డొంకునా అప్పలనాయుడు,మల్లారెడ్డి, బాబ్జి కోట సత్యనారాయణ, దాసరి సత్యనారాయణ, కోరుకొండ రవికుమార్, అప్పారావు, శ్రీను, సతీష్, తాతాజీ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa