చిత్తూరు జిల్లా పుంగనూరులో.. పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే.. ఆయన్ను హౌస్ అరెస్టు చేయడంపై.. రామచంద్ర యాదవ్ ఘాటుగా స్పందించారు. సోమల మండలం లోని అవులపల్లిలో ప్రభుత్వం నిర్మిస్తున్న రిజర్వాయర్ను సందర్శించడం నేరమా అని ప్రశ్నించారు. అక్కడ భూములను కోల్పోయిన రైతులతో మాట్లాడటం తప్పా అని రామచంద్ర యాదవ్ నిలదీశారు.
అవులపల్లికి వెళ్తున్నప్పుడు.. సోమలలో పోలీసులు అడ్డుకున్నారని.. ఇది ఎంత వరకు సమంజసం అని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే రాజకీయాలు చేయాలా.. మిగిలిన వారు చేయకూడదా అని నిలదీశారు. జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రజల కోసం కాదని.. డబ్బుల కోసం నిర్మిస్తున్నారని ఆరోపించారు. పుంగనూరులో అసలు రాజ్యాంగం అమలులో ఉందా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రామచంద్ర యాదవ్ హౌస్ అరెస్టు గురించి పోలీసులను వివరణ కోరగా.. రిజర్వాయర్లను పరిశీలించే క్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని.. శాంత్రి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను హౌస్ అరెస్టు చేశామని పుంగనూరు సీఐ మధుసూదన్ రెడ్డి వివరించారు. ఆయనకు ఇప్పటికే వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉందని.. ఆయనకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa